సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం లోని గోపాలపురం గ్రామం లో ఆషాడ మాసం వచ్చిందంటే ప్రతి స్త్రీ తన చేతుల నిండా ప్రకృతి వనమూలికలతో తయారు చేయబడిన గోరింటాకును అందంగా తన చేతులు అలంకరించుకునే మాసం ఆషాడ మాసం. ప్రతి సంవత్సరం హుజూర్నగర్ మండలం గోపాలపురంలో విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలంతా చేరి సాంప్రదాయపద్ధంగా గోరింటాకును కోసుకొని ఆనాటి ఆచారాలతో పుత్రంతో రుబ్బుకుని ఆచార సాంప్రదాయం కాపాడుకుంటూ చిన్న పెద్ద అందరూ ఒక్కఆడ కూర్చుని ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని తర్వాత ఎర్రగా పండిన అందమైన తమ చేతులను చూసుకుని మురిసిపోయారు . ఈ సందర్భంగా విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు లీలావతి చీకూరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గోరింటాకు పండగను కేంద్ర రాష్ట్రాలు ఆషాడ మాసంలో ఒకరోజు మెహందీ డే నిర్వహించాలని మహిళలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఈ గోరింటాకు పండగను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న విన్నపం ఒక పోరాటం గౌరవాధ్యక్షురాలు మంజుల హరిబాబు కౌన్సిలర్ మాట్లాడుతూ ఆషాడ మాసంలో వచ్చే రుగ్మతలను తట్టుకొని చర్మ రోగాలు, స్త్రీలలో గర్భసంచి సమస్యలు నుంచి కూడా ఈ గోరింటాకు నివారిస్తుంది.ఎనో ఔషధాలతో కూడిన ఆకు గోరింటాకు కాబట్టి స్త్రీలు,పురుషులు ఎవరైనాపెట్టుకోవచ్చు . ఊరు వాడ అందరు కలిసి పండగల జరుపుకోవాలని మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో దంత గాని విజయ, శిరీష,రమాదేవి, గిరిజ, సంధ్య, శ్రీలక్ష్మి, అంజమ్మ, నాగమణి, కరుణ, రామంజమ్మ, విమల,నవ్య,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin