సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం దిర్శించర్ల ముదిరాజ్ కాలనిలో ఘనంగా పండుగల సాయన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దపంగ ఉపేందర్ లు మాట్లాడుతూ రాజ్యం భ్రష్టమై అవినీతి, దోపిడీ అత్యాచారాలు పెరిగినప్పుడు ప్రజల నుండి వీరులు ఉద్భవిస్తారు.అట్లా ప్రజలు రూపొం దించుకున్న నాయకుడు తెలుగొల్ల పండుగ సాయన్న. ఆనాటి నిరంకుశ నిజాం అధికారాలను,అధికారులను ప్రశ్నించి, వారిని ఎదిరించి,తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకొని,ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు.కానీ ఆధిపత్య శక్తులైన దేశముక్ లు, కరణంపటేళ్లు,భూస్వాములు పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయన్నను చంపించారు. ఆ పోరాట యోధున్ని స్మరించుకుంటూ పండుగల సాయన్న జయంతి ప్రతి ముదిరాజ్ వాడల్లో జరుపుకోవాలని,సుమారు 1000 ఓట్లు ఉన్నా దిర్శించర్ల ముదిరాజ్ కాలనీ లో ఆయన విగ్రహం లేకపోవడం చాలా బాధాకరం అని బహుజన రాజ్యం లో ప్రతి వాడవాడలో బహుజనుల విగ్రహలు ఏర్పాటు చేసుకుంటాం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఉపాధ్యక్షులు జీలకర్ర రామస్వామి, దిర్శించర్ల బూత్ అధ్యక్షులు నన్నెపంగ కళ్యణ్ వర్మ,దిర్శించర్ల కుల బంధువుల సమక్షంలో మచ్చ పారశ్రామిక సహకార సంఘం సొసైటీ కార్యదర్శి తురక వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు పంగ బుచ్చి బాబు ముదిరాజ్, జొన్నలగడ్డ వెంకన్న ముదిరాజ్, కుల బంధువులు, ముదిరాజ్ యువకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin