సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : లిక్కర్ , గుట్కా, డబ్బు అక్రమ రవాణ జరుగకుండా క్షుణ్ణంగా వాహనాల తనిఖీలు... అసాంఘిక శక్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదిలికలపై నిఘా... 960 టెట్రా పాకెట్లు, రికార్డులు సక్రమంగా లేని సుమారు 50 వాహనాలు స్వాధీనం... విడపనకల్లు నుండీ పుంగనూరుకు ఆవులను తరలిస్తున్న నలుగురిపై కేసు నమోదు... 48 ఆవులు సురక్షితంగా గోశాలకు తరలింపు... అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాలతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించారు. ఇతర రాష్ట్రాల లిక్కర్ , గుట్కా, డబ్బు అక్రమ రవాణ జరుగకుండా క్షుణ్ణంగా క్షుణ్ణంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. నిన్న రాత్రి 11 గంటల నుండీ ఈరోజు తెల్లవారుజామున 5 వరకు నాకాబందీ కొనసాగించారు. సుమారు 70 ప్రాంతాల్లో నిర్వహించి తనిఖీలు ముమ్మరం చేశారు. శెట్టూరు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టి 960 కర్నాటక మద్యం పాకెట్లు, కారు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. విడపనకల్లు నుండీ పుంగనూరుకు తరలిస్తున్న 48 ఆవులను ఉరవకొండ పోలీసులు సురక్షితంగా గోశాలకు చేర్చడంతో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగుర్ని తాడిపత్రి పోలీసులు పట్టుకుని విచారించారు. జిల్లా వ్యాప్తంగా రికార్డులు సరిగా లేని వివిధ రకాల 50 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై అనంతపురం సబ్ డివిజన్ పోలీసులు 13 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు....
-----------------------
Admin