సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గంలో సమస్యలు కుప్పలుతెప్పలుగా ఉన్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని గాజులరాజం బస్తీ ఇరవై ఐదవ వార్డులో ఇంటింటికి బీఎస్పి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నిర్వహించారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఏర్పడిన్నపటికి సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయని విమర్శించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయకుండా ఒకరి మీద ఒకరు గిల్లికజ్జాలు పెట్టుకుంటూ తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలాన్ని వృధా చేశారని అన్నారు.పాలక,ప్రతిపక్ష పార్టీలు కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రజలను కేవలం ఎన్నికల అప్పుడు మాత్రమే ఉపయోగించుకునే ఓటు యంత్రాలుగా చూస్తున్నారని ఆక్షేపించారు ప్రజా సమస్యలు వేరు,రాజకీయాలు వేరుగా చూసినప్పుడే అభివృద్ధి ఉరుకులు,పరుగులు పెడుతుందని పేర్కొన్నారు.జిల్లా కేంద్రంలోని ప్రజలకు రోజుకు గంట పాటు మంచినీరు సరఫరా చేయలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని విమర్శించారు.ప్రజల సమస్యలను తెలుసుకునే విషయంలో వారి పక్షాన పోరాటం చేసే విషయంలో బీఎస్పీ వెనకడుగు వేయదని స్పష్టం చేశారు ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,రాయరాకుల జగదీశ్,శివశంకర్, ఎస్.కె.ఆదాం,దాసరి జైసింగ్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin