సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : గొత్తి కోయలను అటవీ శాఖ అధికారులు బలవంతంగా వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు, వారి భూములు గుంజుకొని వాటిల్లో మొక్కలు వేస్తూ వారి జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నట్లు జాతీయ మానవ హక్కుల కమీషనుకు 2021లో సుప్రీంకోర్టు లాయర్లు ఆల్టర్ నెట్ లీగల్ ఫోరం ఆధ్వర్యంలో పిర్యాదు చేశారు. దీనిపై రెండు తెలుగు రాష్ట్రా ప్రభత్వాలను మానవ హక్కుల కమీషన్ వివరణ కోరగా ఇలాంటి ఘటనలు ఏవి తమ రాష్ట్రాల పరిధిలో జరగలేదని నివేదిక అందజేశారు. సంతృప్తి చెందని కమీషన్ బాధితులతో నేరుగా కలసి విచారణ చేసేందుకు గురువారం ములకలపల్లి మండలం ఏనుగు అప్పయ్య నగర్(గొత్తి కోయల గ్రామం)లో మానవ హక్కుల కమీషన్ తెంగాణా-ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి ఎం. మదన్ గోపాల్ (రిటైర్డ్ ఐఏఎస్) అధికారి నేతృత్వంలో విచారణ సాగింది. ఇది గ్రామానికి చెందిన సోడే చుక్కయ్య ఫిర్యాదుదారుడిగా ఉండగా నేరుగా చుక్కయ్యతో మదన గోపాల్ గ్రామస్థులు, వివిధ స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధుల సమక్షంలో విచారణ జరిపారు. బాధితులు చెప్పిన విషయాలను మదన్ గోపాల్ నివేదిక రూపంలో కమీషన్ కుందించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ లక్ష్మి, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్, అటవీ శాఖ సీసీఎఫ్ భీమా, డీఎఫ్ఓ రంజిత్ నాయక్, ఏఎస్టీఎస్ డైరెక్టర్ గాంధీ బాబు, ఎఫ్డీఓ తిరుమల రావు, ఎంపీడీఓ చిన్న నాగేశ్వరావు, రేంజర్ రవికిరణ్, ఆర్ఐ తారాచంద్, స్వచ్చంద సేవ ప్రతినిధులు రాజ్ కుమార్, చార్వాక, ఊక ముక్తేశ్వరావు పాల్గొన్నారు....
-----------------------
Admin