సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణం వాసంతి ఆర్థోకేర్ హాస్పటల్ నందు గణపవరం గ్రామానికి చెందిన పొట్ట మట్టయ్య అనే వ్యక్తికి ఆపరేషన్ నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అవసరం కాగా వారు డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు సంప్రదించారు.. దగ్గుపాటి బాబురావు వెంటనే బూరుగడ్డ గ్రామానికి చెందిన చల్లగుండ నవీన్ ధోని అనే ఓ పాజిటివ్ డోనర్ ను సంప్రదించి కోదాడ తిరుమల బ్లడ్ బ్యాంక్ నందు వారికి ఓ పాజిటివ్ రక్తం ఇప్పించడం జరిగింది. ఈ విధంగా సరైన సమయంలో ఆదుకున్న తమకు డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావుకు, డోనర్ నవీన్ ధోనికు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..
-----------------------
Admin