Monday, 27 July 2026 04:18:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ లో ఇద్దరు వడదెబ్బతో మృతి...

Date : 29 May 2023 11:51 PM Views : 368

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లో గత వారం రోజుల నుండి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయి ప్రజలు వృద్ధులు చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు బాధలు పడుతూ వస్తున్నారు ఆ క్రమంలోనే హుజూర్ నగర్ పట్టణంలోని దీక్షిత్ నగర్ కు చెందిన పేద వితంతు భవన నిర్మాణ కార్మికురాలు పల్లపు మరియమ్మ వయస్సు 60 సంవత్సరాలు మరియు హుజూర్ నగర్ పట్టణంలోని దద్దనాల చెరువుకు చెందిన పేద ముస్లిం పఠాన్ ముస్తక్ ఖాన్ వయసు 74 సంవత్సరములు రోజువారి కూలీ పనులకు ,బ్యాటరీ రిపేర్ పనులకు వెళ్లి అధిక ఉష్ణోగ్రతలకు గురి అయ్యి విపరీతమైన జ్వరం వాంతులు విరోచనాలతో పూర్తిగా నిరసించి బీపీ పడిపోయి వడదెబ్బతో మరణించినారు వడదెబ్బ మృతుల సమాచారం హుజూర్ నగర్ తహసిల్దార్ కి హుజూర్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కి వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలియజేయడం జరిగింది .రెవెన్యూ ,వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మృతుల కుటుంబాల దగ్గరకు వచ్చి మరణించిన వారిని పరిశీలించి విచారణ చేసి వెళ్ళినారు . పేద మృతుల కుటుంబాలను సామాజిక కార్యకర్త షేక్ మన్సూర్ అలీ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు షేక్ సైదా బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఐల వెంకన్న గౌడ్ ,ములకలపల్లి నరసింహారావు, పఠాన్ గౌస్ ఖాన్ ఓదార్చినారు వడదెబ్బతో అకాల మరణం చెందిన వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా షేక్ మన్సూర్ అలీ షేక్ సైదా మాట్లాడుతూ పేద వితంతు భవన నిర్మాణ కార్మికురాలి కుటుంబానికి పేద ముస్లిం కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :