సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లో గత వారం రోజుల నుండి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయి ప్రజలు వృద్ధులు చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు బాధలు పడుతూ వస్తున్నారు ఆ క్రమంలోనే హుజూర్ నగర్ పట్టణంలోని దీక్షిత్ నగర్ కు చెందిన పేద వితంతు భవన నిర్మాణ కార్మికురాలు పల్లపు మరియమ్మ వయస్సు 60 సంవత్సరాలు మరియు హుజూర్ నగర్ పట్టణంలోని దద్దనాల చెరువుకు చెందిన పేద ముస్లిం పఠాన్ ముస్తక్ ఖాన్ వయసు 74 సంవత్సరములు రోజువారి కూలీ పనులకు ,బ్యాటరీ రిపేర్ పనులకు వెళ్లి అధిక ఉష్ణోగ్రతలకు గురి అయ్యి విపరీతమైన జ్వరం వాంతులు విరోచనాలతో పూర్తిగా నిరసించి బీపీ పడిపోయి వడదెబ్బతో మరణించినారు వడదెబ్బ మృతుల సమాచారం హుజూర్ నగర్ తహసిల్దార్ కి హుజూర్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కి వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలియజేయడం జరిగింది .రెవెన్యూ ,వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మృతుల కుటుంబాల దగ్గరకు వచ్చి మరణించిన వారిని పరిశీలించి విచారణ చేసి వెళ్ళినారు . పేద మృతుల కుటుంబాలను సామాజిక కార్యకర్త షేక్ మన్సూర్ అలీ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు షేక్ సైదా బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఐల వెంకన్న గౌడ్ ,ములకలపల్లి నరసింహారావు, పఠాన్ గౌస్ ఖాన్ ఓదార్చినారు వడదెబ్బతో అకాల మరణం చెందిన వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా షేక్ మన్సూర్ అలీ షేక్ సైదా మాట్లాడుతూ పేద వితంతు భవన నిర్మాణ కార్మికురాలి కుటుంబానికి పేద ముస్లిం కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు.
-----------------------
Admin