సర్కార్ టీవీ న్యూస్ / కాకినాడ జిల్లా : పిఠాపురం : నూతనంగా పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ కు బదిలీపై విచ్చేసిన ఎస్ఐ వడ్డాది మణికుమార్ ను బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ ఖండవల్లి లోవరాజు మంగళవారం పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా ఎస్సైని కలిశారు. ఈ సందర్భంగా ఖండవల్లి లోవరాజు మాట్లాడుతూ పిఠాపురం పట్టణంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. పిఠాపురం పట్టణంలో మాధవపురం రైల్వే గేట్ వద్ద దారిదోపిడి బెడద ఎక్కువగా ఉందని, అటుగా రాత్రిపూట ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారన్నారు. అదేవిధంగా గోర్స రైల్వే గేట్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్ద యువత గంజాయి, మద్యం సేవిస్తున్నారని ఆ ప్రాంతంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఎస్ఐని కోరానన్నారు....
-----------------------
Admin