సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల కేంద్రంలోని ఐఎఫ్టియు ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్మిక,రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరాశనగ కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న దేశభక్తి సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘ నాయకులు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలోఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, మీడియా సమావేశంలో కోరారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ అధ్యక్షులు ఎండి కాజా మొయినుద్దీన్, ఎల్ఐసి యూనియన్ నాయకులు వి. బాలయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, బి ఓ సి ఆర్మూర్ నాయకులు రాజేశ్వర్ లు పాల్గొని మాట్లాడుతూ మోడీ అమిషాలు ఎన్నికల వాగ్దానాలకు భిన్నంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చారని, కార్మికుల ఉపాధిని కొల్లగొట్టారని వారు అన్నారు. దేశంలో 45 కోట్ల మంది కార్మికుల్లో కేవలం ఐదు కోట్ల మందికేసమాజిక చట్టాలు అమలు చేయబడుతున్నాయని, మిగతా కార్మికుల తీవ్ర ఇబ్బందులతో బతుకులను కడుపుతున్నారని వారు తెలిపారు. ప్రజల సంపాదన అంబానీ ఆదాన్నిలాంటి పెట్టుబడిదారులకు మోడీ అప్పజెబుతున్నారని వారన్నారు. రంగ సంస్థలకు ప్రైవేటు వ్యక్తులకుఅమ్మేస్తున్నారని, కార్మికుల జీవన ప్రాణాలు దెబ్బతీస్తున్నారని వారు ఆవేద వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లు వాపస్ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిత్యవసర సరుకులు ధరలు నియంత్రించాలని, కుటీర పరిశ్రమలను కాపాడాలని ఉపాధి భద్రత కల్పించాలని. వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్ సేఫ్టీ బిల్లు పేరుతో ఆటో కార్మికుల పొట్ట కొట్టకూడదని ప్రధానమంత్రిని వారు కోరారు. స్వచ్ఛ భారత్ లో అగ్రభాగాన్ని నిలిచిన సిపాయిళ్ల శ్రమిస్తున్న సఫాయి కార్మికుల వేతనాలు పెంచి 2016 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పని సమాన వేతనాలు అమలు చెయ్యాలా డిమాండ్ చేశారు. కోట్లాది కార్మికులు రైతులు ఆధారపడిన బీడీ పరిశ్రమ దెబ్బతీయడానికి అనేక అంక్షలు పెట్టి కార్మిక జీవితాలతో చెల గాటమాడుతున్నారని వారు తెలిపారు. ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీలకు కంటిరప్పలా కాపాడాల్సిన బాధ్యత మరిచిపోయి, కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసే కుట్రలో మోడీ సర్కా ఉందని వారు తెలిపారు. రైతు, కార్మిక,విద్యార్థి యువజన,మహిళలు, ఉద్యోగులు,మేధావులు, ఐక్యంగామోడీ రైతు,కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరాశంగా ఫిబ్రవరి 16న జరిగే సమ్మె గ్రామీణ బందులో పాల్గొనాలని వారు కార్మికులను విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో బిజెపి తగిన గుణపాఠం నేర్పించాలని ప్రజలకు తీర్పునిచ్చారు.
-----------------------
Admin