సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని సవరించాలని ధర్మ సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు ని కలిసి తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు మాత్రమే ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాలని మరియు ఆటో డ్రైవర్లకు ప్రతినెల 3000 రూపాయలను ఇవ్వాలని, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాన్ని పోషించే ఇంటి యజమాని పురుషునికి కూడా ఉచిత బస్సు సౌకర్యం, కల్పించాలని ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సిహెచ్. కిరణ్ కుమార్ జిల్లా నాయకులు, శ్రీనివాస్, బాలు మహారాజ్, విజయరామరాజు మండల నాయకులు సైదులు, రమేష్ నాగరాజు అంబేద్కర్ వంశీ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin