సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు రేపటి (సోమవారం) పదవ తరగతి పరీక్షలు ప్రారంభం నైపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్, విజ్ఞాన్ స్కూల్, శ్రీ విజ్ఞాన్ స్కూల్ , పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. పదవ తరగతి పరీక్షల కోసం ఓబులదేవర చెరువు మండల పరిధి లో గల విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు పోలీసు వారి సూచనలు. పరీక్షా కేంద్రాల వద్ద మరియు చుట్టుపక్కల 100మీ పరిధిలో మొబైల్ ఫోన్లు నిషేధం. పరీక్షా కేంద్రాల వద్ద మరియు చుట్టుపక్కల 200 మీ పరిధిలో 144 Cr.PC section అమలులో ఉండటంవలన పిల్లల తల్లితండ్రులు కానీ బయటి వ్యక్తులు కానీ ఎవరు తిరగకూడదు. కేవలం చీఫ్ ఎగ్జామినర్ మాత్రమే మొబైల్ యాక్సెస్ కలిగి ఉంటారు. ఎటువంటి మెటీరియల్ ఫోటోకాపీని అనుమతించకుండా అన్ని జిరాక్స్ సెంటర్ లు ప్రతి దినము మధ్యాహ్నం వరకు మూసివేయవలయును. ఎవరైనా తెరిచిన ఎడల వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. విద్యార్ధిని ,విద్యార్థులు పరీక్షా సమయానికి ముందే పరీక్ష కేంద్రం చేరుకోవాలి. సమయము దాటిన తరువాత పరీక్ష కేంద్రము లోకి అనుమతించబడరు అని సర్కిల్ ఇన్స్పెక్టర్,నల్లమాడ జి.నిరంజన రెడ్డి , సబ్ ఇన్స్పెక్టర్ ఓ డి చెరువు కే. గోపి పేర్కొన్నారు...
-----------------------
Admin