సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : తేది :12.02.2024 అనగా ఈ రోజున ఏఐసీసీ మహిళ ప్రధాన కార్యదర్శి,పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనలమేరకు నియోజకవర్గ కోర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న అధ్యక్షతనలో మండల అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అదేవిధంగా ప్రతి నెల 200 యూనిట్ ల ఉచిత విద్యుత్ ఆరు గ్యారంటీ పథకాలలో ఈ రెండు సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరారు.మండల వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహనా కల్పించాలని అదేవిధంగా అధికారులకు ప్రజలు పథకాలకు సంబందించిన పత్రాలను సమర్పించి సర్వేకు వచ్చిన అధికారులకు ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామగ్రామాన సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్, జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య,బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు,PACS వైస్ చైర్మన్ & మండల ఉపాధ్యక్షులు చెన్నూరి బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, మాడుగురి ప్రసాద్,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కర్నె సత్యం, బ్లాక్ యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్, మండల సహాయ కార్యదర్శి ముమ్మానేని రమేష్, చామర్తి కిషోర్, కొయ్యల రంజిత్, బూర చేరాలు, సప్పిడి రాములు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin