సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల వ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ కూలీలందరూ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద బ్యాంక్ లో 20 రూపాయలు సంవత్సరానికి చెల్లించాలి కూలీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలందరికీ ఈ బీమా పథకం గుర్తిస్తుంది ఎంపీడీవో పోలప్ప పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ఈ బీమా పథకం ముఖ్య ఉద్దేశం ప్రమాదవశాత్తు అంగవైకల్యం జరిగిన వారికి లక్ష రూపాయలు చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది కావున ప్రతి ఒక్కరు తప్పకుండా బ్యాంక్ అకౌంట్ కలిగిన బ్యాంకులో ఈ బీమా చేయించాలని క్షేత్ర సహాయకులను ఆదేశించారు. 18 నుండి 70 సంవత్సరాల వరకు కలిగిన వారు అర్హులు బ్యాంకుల నందు పేరు నమోదు చేయించుకుని ఆ బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం అయి ఉండాలి. సంవత్సరానికి ఒకసారి 20 రూపాయలు చెల్లించాలి. ఈ బీమా జూన్ ఒకటో తేదీ నుండి మే 31 వరకు ఒక సంవత్సరం గా తీసుకుంటారు.కావున ఉపాధి హామీ కూలీలందరికీ ఈ సురక్ష బీమా యోజన కింద నమోదు చేయించాలని ఎంపీడీవో పొలప్ప పేర్కొన్నారు
-----------------------
Admin