సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డిఓ కి వినతి పత్రం అందించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు హుజూర్ నగర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర ప్రతిపక్షపార్టీ లు ఓటమి భయంతో బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు మరియు నాయకులపై జరుపుతున్న దాడులు,హత్యా ప్రయత్న హింసా రాజకీయాలకు వ్యతిరేకంగా తగిన చర్యలను తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ నర్సింగ్ వెంకటేశ్వర్లు, ఎర్రంశెట్టి పిచ్చయ్య, పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు దొంతి రెడ్డి పద్మ రాంరెడ్డి, యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్, కౌన్సిలర్లు కే ఎల్ ఎన్ రావు, దొంగరి మంగమ్మ వీరారెడ్డి, కొమ్ము శ్రీను, నాయకులు బోనాల అనిత లక్ష్మారెడ్డి, యువజన నాయకులు పిన్నెని సంపత్ (దళపతి), మేరీగ సాయి, ఊదారి మురళీకృష్ణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin