సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలో మహా జన్ సంపర్క్ యోజనలో భాగంగా మండల అధ్యక్షులు దుండిగాల యల్లయ్య అధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా "మేరే బూత్ సబ్సే మజ్బుద్ - ఇంటింటా బిజెపి" కార్యక్రమంలో మండలంలోని, మట్టపల్లి, సుల్తాను పుర్ తండా, అల్లిపురం, వర్ధపురం, యతవాకిల్ల గ్రామాలలో విస్తృతంగా పర్యటన జరిపి, ఇంటింటా నరేంద్రమోడీ గురించి, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి హుజూర్ నగర్ అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి , విస్తారక్ తాడువాయి నాగరామకృష్ణ నాయకులు మంద వెంకటేశ్వర్లు కలిసి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధికి బిజెపి ఏకైకమైన మార్గమని ప్రధాని నరంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం ఎంతో శ్రేయస్కరం నిధులు ఇస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకే మోడీ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మోడీ 9 ఏళ్ల పరిపాలనను ప్రజలకు వివరిస్తూ వాళ్ల యొక్క అభిలాషను వ్యక్తపరిచారు..
-----------------------
Admin