సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : 25వ తారీఖున పాత కొత్తగూడెం లో 800 మంది పేదలకు ఇల్లు స్థలాలు పంపిణీ చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా అధికారులను వెంటబెట్టుకొని పాత కొత్తగూడెంలోని డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పక్కన గల 25 ఎకరాల స్థలాన్ని శనివారం పరిశీలించారు. ప్రతి ఒక్క పేదో వాడికి సుమారు 8 లక్షల రూపాయలు విలువ చేసే 75 గజాల స్థలాన్ని ఇవ్వబోతున్నామని, ఈ 28 ఎకరాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన లేఅవుట్ చేసి, మార్కింగ్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే వనమా. ఇది మీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ గారి నాయకత్వంలో కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రతి పేదవారిని ఆదుకుంటామని, ఈనెల 25న అనగా సోమవారం ఉదయం 9 గంటలకు కొత్తగూడెం క్లబ్ కి లబ్ధిదారులు రాగలరని ఎమ్మెల్యే వనమా విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం క్లబ లో స్వయంగా నా చేతుల మీదుగా 800 మంది లబ్ధిదారులకు స్థలాలు పంపిణీ చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వనమా వెంటే మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘు, ఎమ్మార్వో పుల్లయ్య, టీ పి వో ప్రభాకర్, కౌన్సిలర్లు వడ్డాద్రి సుజాత, పరమేష్ యాదవ్, కోలాపురి ధర్మరాజు, బిఆర్ఎస్ నాయకులు MA రజాక్, విజయ్, నాగరాజు మరియు అధికారులు, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin