సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి సాయి ఆరామoలో, రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేసారు. ఓటు బ్యాంక్ అధికంగా వున్న బీసీలు ఐకమత్యంతో ముందుకు సాగాలని ఏపీ బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా కేసన శంకర్ రావు మాట్లాడుతూ...ఆర్థికంగా బలహీన వర్గాలు అనే పేరుతో ఆధిపత్య కులాలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించిన 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. పార్లమెంటులో 50% బీసీలకు సీట్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. దీనికి సహకరించిన ప్రతి పార్టీకి బీసీ సంఘం అనేది తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మండల కమిషన్ సిఫారసు మేరకు కుల జనగణన చేయాలని రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ కోరారు. రాబోయే రోజుల్లో కొత్త జిల్లాల్లో పార్టీలకు అతీతంగా నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో బీసీలు ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్లాలని వారు పిలుపునిచ్చారు. ఈ.డబ్ల్యూ.ఎస్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్ధించడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని సూచించారు. కావున ఇచ్చిన తీర్పును పునఃపరిశీలన చేయాలని ఏపీ బీసీ సంక్షేమసంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు వాల్మీకి హరి, సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నామాల శంకర, బీసీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సంపంగి గోవర్ధన్ , పుట్టపర్తి బిసి సీనియర్ నాయకుడు PC.గంగన్న , రాష్ట్ర కార్యదర్శి లింగమయ్య , ప్రధాన కార్యదర్శి ఎస్.ఆర్.నాగభూషణం , స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పాల రాజ్ కిరణ్ , B.C.S.F రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణ్ కుమార్ గౌడ్, సాయి రాజ్ , తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin