సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కలెక్టరేట్: ప్రైవేటు పాఠశాలల విద్యా సంస్థలు తల్లిదండ్రుల వద్ద నుండి నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తు దోపిడీకి పాల్పడుతున్నాయని వాటిని అరికట్టాలి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు.పుస్తకాలు,యూనిఫామ్,స్కూల్ ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు? బుక్స్,యూనిఫామ్స్,అమ్ముతూ వేలకు,వేలు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రైవేటు పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో బీఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకోని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కోలా మల్లికా,కేతిని కుమారి,ఏడెల్లి మర్థమ్మ,ఎర్రంశెట్టి రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin