సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో చలో లక్ష్మీదేవి పల్లి ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున బిజెపి శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి తరలివచ్చారు భారీ వాహనశ్రేణితో చౌరస్తా నుండి ప్రదర్శనతో బయలుదేరారు ఈ సందర్భంగా ఓ వాహనంపై ఖాళీ కుర్చీలో కేసీఆర్ చిత్రపటాన్ని పెట్టి ఊరేగించుకుంటూ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ స్థలం వద్దకు చేరుకుంటున్నారు. సంఘటనా స్థలం వద్ద ఆందోళన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ర్యాలీలో పాల్గొన్న టి. ఆచారి, మాజీ ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహ రెడ్డి, హాజరయ్యారు. అదేవిధంగా స్థానిక నేతలు బిజెపి అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ విజయ్ కుమార్, సీనియర్ నేతలు అందే బాబయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకా పెద్ద ఎత్తున శ్రేణులు హాజరయ్యారు.
-----------------------
Admin