సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : గాంధీ భవన్లో సీనియర్ బిసి నాయకులు కత్తి వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్యే ఆశావాహులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో ముందుగానే పీసీసీ స్పష్టం చేయాలని బీసీలకు కేటాయించిన సీట్లలో బీసీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయాలనే డిమాండ్ లతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా బీసీలకు తగినన్ని టికెట్లు కేటాయించేలా పీసీసీ, ఏఐసీసీ జోక్యం చేసుకోవాలని, ఇతర సామాజిక వర్గాలైన ఎస్సీ, ఎస్టీ నేతలను అధిష్టానం ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపినట్టుగా బీసీ నేతలను అధిష్ఠానం పిలిచి మాట్లాడాలని బిసి ఆశావాహ అభ్యర్థులు కోరుతున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లు అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కార్, మరియు అనిల్ కుమార్, చెరుకు సుధాకర్ రాష్ట్ర బిసి ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
-----------------------
Admin