సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మఠంపల్లి మండలం గుర్రంపొడు గ్రామంలో ఎంపీపీ పార్వతి కొండా నాయక్ నిర్వహించిన చెరువులు ,సాగునీటి దినోత్సవం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ఇరిగేషన్ రంగంలో వాస్తవంగా తెలంగాణ రాక పూర్వం ఈ ప్రాంతం యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనందరి కూడా తెలుసు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా సాగునీరు లేక కరెంటు లేక వ్యవసాయం చేసే పరిస్థితి లేక అనేక మందికి భూములు జాగాలు ఉన్నప్పటికీ కూడా సకాలంలో నీళ్లు, కరెంట్ లేక వలసలు పోయిన పరిస్థితి, ఈ భూమి జాగలకు నమ్ముకుంటే బతుకడం కష్టం అని, ఇతర రాష్ట్రాల కు దేశాలకు బతుకు తెరువు కోసం పోదామని, ఒక్కొక్కరు ఊరు నుండి వందల కుటుంబాలు వలసలు పోయిన పరిస్థితిలో బలవంతంగా వ్యవసాయం చేసి పంట చేతికి రాక రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాటువంటి పరిస్థితి నుండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసుకున్నామని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ఈ రోజు ఏ గ్రామానికి వెల్లి చూసిన చెరువులు నిండు కుండల నీళ్లు ఉండడం అనేది అద్భుతంగా చెప్పుకోవచ్చు, అందుకే ఒక పని జరిగిందంటే దానికదే జరుగదు, ఆకాశం నుండి ఊడిపడదు, ఒక విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి గా ఉంటేనే ఇలా జరుగుతుందని అన్నారు.65 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలించినటువంటి నాయకులు, ఏనాడు కూడా సాగునీరు రంగంలో ఒక మంచి ప్రయత్నం చేసి, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నీటి వనరులను రైతులకు అందించాలని గాని, ఇక్కడ ఉన్నటువంటి ఎడారి భూములకు సాగునీరు అందించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఏనాడు ఆలోచించలేదు, మాటలు చెప్పిండ్రు తప్ప, పని జరగలేదు, కాని మన కెసిఆర్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రంగంలో అనేక అద్భుతాలు జరుగుతాయని ఆయన తెలిపారు...ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, కార్యకర్తలు,వివిధ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి లు, రెవిన్యూ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు,సిబ్బంది,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin