సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లో దోమల నిర్మూలన చర్యలను హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తో కలిసి పరిశీలించి మాట్లాడుతూ అవగాహనతోనే వ్యాధులకు దూరంగా ఉండవచ్చని పరిసరాల పారిశుధ్యం, ఇంటి చుట్టు పక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవడo ద్వారా ప్రజలు మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు.ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వలు ఉన్న ఎడల దోమల వ్యాప్తి జరిగి మలేరియా, డెంగ్యూ , బోదకాలు, మెదడు వాపు వంటి వ్యాధులువ్యాపిస్తాయనీ ఇంటి చుట్టు పక్కల కుండలు, టైర్లు ,జాడీలు డిస్పోజల్ గ్లాస్ లేకుండా చూడాలని వారానికి ఒకరోజు డ్రై డే పాటించి నీటి తొట్లు, డ్రమ్ములు , ఓవర్హెడ్ ట్యాంకులను కడిగి ఆరబెట్టాలనీ సూచించారు. .ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పద్మ, పి హెచ్ ఎన్ నూర్జహాన్ బేగం ఆరోగ్య కార్యకర్తలు ఇందిరాల రామకృష్ణ ,మాధవి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin