సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ రూరల్ : మండల పరిధిలో ఉల్వనూరు ఎస్సీ కాలనీలో 15 ఏండ్ల క్రితం పూడ్చిన లోద్ధిగండి చెరువును కొత్తగూడెంలో గెలిచిన వెంటనే పునరుద్ధరిస్తామని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి యెర్రా కామేష్ హామీ ఇచ్చారు.మన కొత్తగూడెం-మన కామేష్ కార్యక్రమంలో భాగంగా గురువారం యానంబైల్,సత్యనారాయణపురం,ఉల్వనూరు,మొండికట్ట గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ లొద్దిగండి చెరువును పూడ్చి వేయడంతో వందలాది ఎకరాలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.అదేవిధంగా మారుమూల గిరిజన గ్రామాలైన చిరుతనిపాడు,పెద్దకలిశా,ఒంటిగుడిసె,రాళ్ళచెలక తదితర గ్రామాల్లో త్రాగునీరు సరఫరా లేక చుట్టుపక్కల చెరువుల నుండి నీళ్ళు తెచ్చుకొని త్రాగడం మూలంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని,ప్రభుత్వం,పాలకులు ఇన్ని యేండ్లు అయిన వీళ్ళను మనుషులుగా చూడకపోవడం బాధాకరమన్నారు.నియోజకవర్గంలో ఎవరు గెలిచిన ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు.కొత్తగూడెంలో కొత్తవారిని ఎప్పుడు ఆదరిస్తారని అదేక్రమంలో ఈఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు.బీఎస్పీ గెలిచిన ఆరు నెలల్లో నియోజకవర్గంలో నిరాదరణకు,కబ్జాలకు గురైన చెరువులను పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు ఈకార్యక్రమంలో మండల,పట్టణ అధ్యక్షులు కాటబోయిన వసుంధర,కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,జిల్లా మహిళా అధ్యక్షురాలు బండి రమణి,అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కేతిని కుమారి,కోలా మల్లికా,రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin