Monday, 27 July 2026 03:44:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లొద్దిగండి చెరువును పునరుద్ధరిస్తం... - బిఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్ర కామేష్

Date : 20 October 2023 06:36 AM Views : 282

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ రూరల్ : మండల పరిధిలో ఉల్వనూరు ఎస్సీ కాలనీలో 15 ఏండ్ల క్రితం పూడ్చిన లోద్ధిగండి చెరువును కొత్తగూడెంలో గెలిచిన వెంటనే పునరుద్ధరిస్తామని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి యెర్రా కామేష్ హామీ ఇచ్చారు.మన కొత్తగూడెం-మన కామేష్ కార్యక్రమంలో భాగంగా గురువారం యానంబైల్,సత్యనారాయణపురం,ఉల్వనూరు,మొండికట్ట గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ లొద్దిగండి చెరువును పూడ్చి వేయడంతో వందలాది ఎకరాలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.అదేవిధంగా మారుమూల గిరిజన గ్రామాలైన చిరుతనిపాడు,పెద్దకలిశా,ఒంటిగుడిసె,రాళ్ళచెలక తదితర గ్రామాల్లో త్రాగునీరు సరఫరా లేక చుట్టుపక్కల చెరువుల నుండి నీళ్ళు తెచ్చుకొని త్రాగడం మూలంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని,ప్రభుత్వం,పాలకులు ఇన్ని యేండ్లు అయిన వీళ్ళను మనుషులుగా చూడకపోవడం బాధాకరమన్నారు.నియోజకవర్గంలో ఎవరు గెలిచిన ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు.కొత్తగూడెంలో కొత్తవారిని ఎప్పుడు ఆదరిస్తారని అదేక్రమంలో ఈఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు.బీఎస్పీ గెలిచిన ఆరు నెలల్లో నియోజకవర్గంలో నిరాదరణకు,కబ్జాలకు గురైన చెరువులను పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు ఈకార్యక్రమంలో మండల,పట్టణ అధ్యక్షులు కాటబోయిన వసుంధర,కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,జిల్లా మహిళా అధ్యక్షురాలు బండి రమణి,అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కేతిని కుమారి,కోలా మల్లికా,రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :