సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవ వేడుకలో పాల్గొని,జాతీయ జెండా ఆవిష్కరించినఎమ్మెల్యే మాధవరెడ్డి సర్కార్ న్యూస్ నర్సంపేట టౌన్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 17 సెప్టెంబర్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవ వేడుకలో పాల్గొని,జాతీయ జెండా ఆవిష్కరించి ఎమ్మెల్యే మాధవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 1947 ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణకు స్వాతంత్రం రాక నిజాం పాలనలో మగ్గిపోతున్న సందర్భంలో అప్పటి ప్రధానమంత్రి శ్రీ. జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలో అప్పటి హోంమంత్రి శ్రీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన నిజాం పాలనపై, రజాకర్ల దురాగతాలపై సైనిక చర్యగా జరిపి,యుద్ధంలో నిజాం ను ఓడించి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించిందని పేర్కొన్నారు. అదేవిధంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లో తెలంగాణ ప్రజలు నయా నిజాం (కేసీఆర్) నిరంకుశ పాలనను అంతమెందించి, ప్రజా పాలన తీసుకువచ్చిన సందర్భంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్,పిసీసీ సభ్యులు పెండె రామానంద్,పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్,మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,జిల్లా మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ,జిల్లా ఓబిసి అధ్యక్షుడు ఓర్స్ తిరుపతి,నర్సంపేట మండలం అధ్యక్షులు కత్తి కిరణ్,పట్టణ మహిళా అధ్యక్షురాలు కీర్తి,మాజీ కౌన్సిలర్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు,
-----------------------
Reporter