సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా వారి సేవలను పొంది ఆ తర్వాత వారికి అన్యాయం చేశారని ఎంతోమంది ఉద్యమకారులు రోడ్లపై పడ్డారని వారిని చేరదీసేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ముందుకు వస్తుందని షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ భరోసా ఇచ్చారు. హాజిపల్లి గ్రామం నుండి గ్రామ ఉప సర్పంచ్ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి గ్రామ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు 2007 నుంచి ఉద్యమ కాలం నుండి పార్టీలో ఉండి తగిన గుర్తింపు లేక కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వీర్లపల్లి శంకర్ ప్రకటించారు. ఇస్నాతి విష్ణు కుమార్, వార్డు సభ్యులు గుండ్రాది విష్ణు, కో ఆప్షన్ నెంబర్ వి జంగయ్య, రూప్ సాగర్, పాండురంగం, ఎస్ ఉపేందర్, శివ, రాజేష్, జి సాయిబాబు, రమేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ శుభవార్త చెప్పిందనీ ఉద్యమ కారులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 250 గజాల ఇంటిస్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు, విద్యార్థులకు రూ.5 లక్షలు విద్యా భరోసా, రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ గవర్నమెంట్ స్కూల్, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ.4 వేల ఫించన్, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యభీమా, మహాలక్ష్మి పేరుతో మహిళలకు రూ.2500 సాయం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల సాయం, క్వింటాల్ వరి పంటకు రూ.500 బోనస్, గృహ అవసరాల నిమిత్తం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆజిపల్లి ఉపసర్పంచ్ సుదర్శన్, ఎంపీటీసీ శ్రీశైలం, గ్రామ కమిటీ అధ్యక్షుడు రామప్ప, ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్, ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సురేందర్ గౌడ్, రాజేందర్ తదితరులు ఉన్నారు.
-----------------------
Admin