సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం బచ్చలకూరి భాగ్యమ్మ (మేడారం గ్రామ పంచాయితీ సిబ్బంది ) అనారోగ్యం తో గత వారం చనిపోయిన విషయం తెలిసి ఓజో ఫౌండేషన్ వ్యవస్థాపకులు రఘు చేయూత ద్వార 50కేజీ ల రైస్ బ్యాగ్ ను 5000/- ఓజో ఫౌండేషన్ ఇంచార్జీ కుక్కల వెంకన్న చేతుల మీదుగా అందజేశారు. నిరుపేద కుటుంబాలకు రఘు చేయూత ద్వారా అందిస్తున్న సేవలు తెలుసుకున్న గ్రామస్తులు ఓజో ఫౌండేషన్ సభ్యులు ఫోన్ ద్వారా ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న కు తెలియజేయగా వారు ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు కు తెలియజేశారు. ఇట్టి విషయం తెలుసుకున్న ఓజో పౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబనికి ఓజో ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలియజేసారు. కుక్కల వెంకన్న మాట్లాడుతు ఈ నియోజకవర్గంలో రఘు చేయూత ద్వారా ఎస్ సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలలోని పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న రఘు లాంటి మంచి వ్యక్తికి మీరు అందరూ కూడా తోడుగా ఉండాలని రాబోయే రోజులలో ఒక అవకాశం వివ్వాలని కోరుకుంటున్న ఈ కార్యక్రమంలో యల్లావుల శివ శంకర్ యాదవ్,మన్నేం వేణు యాదవ్, పాల్వాయి మధు,పెరబోయిన శ్రీను,చందు, సురేష్, వెంకట్,మహేష్,శ్రవణ్, రత్న, అంజి,గోపి, సాయి,రూపాష్, గ్రమ పెద్దలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin