సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణానికి చెందిన సీనియర్ ఆర్ఎంపి గ్రామీణ వైద్యుడు బెల్లంకొండ కృష్ణ తన స్వగృహంలో అకాల మరణం చెందినారు. ఆర్.ఎం.పి బెల్లంకొండ కృష్ణ భౌతికకాయంపై హుజూర్ నగర్ డివిజన్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ ఆర్ఎంపీలతో కలిసి పూలమాలలు వేసి అశ్రు నివాళులు అర్పించినారు కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యం ప్రసాదించాలని బెల్లంకొండ కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. మన్సూర్ అలీ మాట్లాడుతూ అందరితో స్నేహంగా కలగొ లుపుగా ఉండి అనేక సంవత్సరాలుగా అనేకమంది ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించిన గొప్ప సేవా గుణం కలిగిన వ్యక్తి ఆర్.ఎం.పి బెల్లంకొండ కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఆర్ఎంపి సంఘం ప్రధాన కార్యదర్శి సన్నిధి వెంకటేశ్వర్లు కోశాధికారి ఆత్కూరి శ్రీనివాస్ పూల రాజు మదనాచారి మరియు హుజూర్నగర్ గౌడ సొసైటీ అధ్యక్షులు వల్లభు దాసు కృష్ణ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సైదా బెల్లంకొండ గురవయ్య హుజూర్ నగర్ మండలంలోని ఆర్ఎంపి పిఎంపి గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు....
-----------------------
Admin