సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలో తోపుడు బండి పై పొట్ట కూటు కోసం టిఫిన్ సెంటర్ నడుపుతున్న దివ్యాంగుడు విజయ్,పోలీస్ అధికారిని టిఫిన్ బిల్లు అడిగినందుకు విచక్షణ కోల్పోయి దివ్యాంగుడి పై దాడి చేసి గాయపరిచిన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితున్ని శనివారం పరామర్శించిన టీవీపీఎస్ సభ్యులు దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు విజేఏసి చైర్మన్ సతీష్ గుండపునేని మాట్లాడుతూ ప్రజలను కాపాడాల్సిన పోలీసులే దివ్యాంగుల పై దాడి చేసి గాయపరచడమే ఫ్రెండ్లీ పోలీస్లా అని, ఖచ్చితంగా ఇలాంటి పోలీసులపై కఠిన చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటివి దాడులు పునరావృతం కాకుండా, దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తద్వారా పోలీస్ వ్యవస్థపై సామాన్యులకు సైతం నమ్మకం కలిగించాలన్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో కళా బాబు రెడ్డి, గట్ల రమేష్, సున్నం కరుణాకర్, కదలి సాయిబాబా, కాటి నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin