సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కేశంపేట్ మండల్ : గ్రామాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కేశంపేట ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ అన్నారు. గురువారం షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఎక్లాస్ ఖాన్ పేటలో రూ. 1.56 కోట్లతో స్కూల్ భవనం, సంతాపూర్ లో రూ. 2 లక్షలు, కొత్తపేటలో రూ. 20లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో సర్వతో ముఖాభివృద్ధి దిశగా ప్రభుత్వం అభివృద్ది పనులు చేపడుతుందని అన్నారు. దశలవారీగా అన్ని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
-----------------------
Admin