సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం నారప్ప గారి పల్లి సమీపాన ఉన్న మల్లూరమ్మ ఆలయం వద్ద పాల ఏకరి ల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం గౌరవ అధ్యక్షులు రామస్వామి నాయుడు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన పాల ఏకరి లను రాజకీయ నాయకులు కరివేపాకుల వాడుకుంటున్నారని తప్పుపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో పాల ఏకరి ల నూతన కమిటీలను ఏర్పాటు చేసి అందరినీ ఐక్యం చేసి మా హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామన్నారు. రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిన పాల ఏకరి లకు చేయూతనిచ్చిన వారికి మా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పాల ఏకరి లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రతి ఏటా ఆ కార్పొరేషన్ కు వంద కోట్లు కేటాయించి పాల ఏకరి ల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పాల ఏకరి సంఘం నాయకులు పెదర్ నాయుడు శివరాం నాయుడు, మల్లేశ్వర నాయుడు, అంజనప్ప నాయుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల నూతన అధ్యక్షులుగా మురళీధర్ నాయుడు, ఉపాధ్యక్షులుగా శివరాం నాయుడును, అను కుమార్ నాయుడును ఎన్నుకున్నారు....
-----------------------
Admin