Monday, 27 July 2026 05:41:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అడివిలో ప్లాస్టిక్ కవర్లో పసికందు కాపాడిన యువకుడు

Date : 14 June 2025 08:46 AM Views : 687

సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : వి ఆర్ పురం : తల్లికి ఏం కష్టం వచ్చిందో కానీ అప్పుడే పుట్టిన పసికందును అడవిలో ప్లాస్టిక్ కవర్లో పెట్టి వదిలేసింది అల్లూరి సీతారాం జిల్లా వీరపురం మండలంలోని కొక్కెర గూడెం అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది గ్రామానికి చెందిన మడివి రత్నం రాజ అనే యువకుడు శుక్రవారం అడవిలో వేటకు వెళ్ళగా అక్కడ ఓ పసికందు రోదన వినపడగా చుట్టుపక్కల పరిశీలించాడు చెట్టుకు వేలాడుతున్న ప్లాస్టిక్ కవర్ నుంచి శబ్దం రావడానికి గుర్తించాడు వెంటనే వెళ్లి చూడగా కవర్లో పసికందు కనిపించగా గ్రామానికి వెళ్లి తన తల్లికి ముత్తమ్మకు చెప్పగా ఆమె పసికందును రక్షించి గ్రామానికి తీసుకువచ్చింది ఈలోగా ఆశా వర్కర్ ద్వారా విషయం తెలుసుకున్న సబ్ సెంటర్ కుందులూరు ఏఎన్ఎం గుంపెనపల్లి చంద్రమ్మ చింతూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్ళింది చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మహేష్ ఆ పసికందును ఇంక్యుబేటర్లో ఉంచి చికిత్స అందించారు దీనిపై చింతురు ఆస్పటల్ సూపర్డెంట్ కోటిరెడ్డి మాట్లాడుతూ పసికందు శుక్రవారం ఉదయం పుట్టి ఉంటాడని బొడ్డుగూడ కోయకుండా పసికందును సంచులు ఉంచి చెట్టుకు వేలాడదీయడం జరిగిందని పసికందు ఏడు నుంచి ఎనిమిది గంటలు ఏకధాటిగా ఏడవడం మరియు ఎండలో ఉండడం వలన బొడ్డు కూడా కొయ్యకపోవడం వల్ల రక్తస్రావం ఎక్కువ అవటం వలన పసికందు పరిస్థితి విషమంగా మారింది ప్రస్తుతం పసికందుకు మెరుగైన శాస్త్ర చికిత్స అందిస్తున్నాం మరియు పోలీసులకు ఈ విషయం తెలపడం జరిగింది

-----------------------

భట్టా ప్రసాద్ 94405 72187

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :