సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ నియోజకవర్గం లోని చిలుకూరు మండలం చెన్నారి గూడెం గ్రామం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కమతం కొండయ్య మాట్లాడుతూ రాజ్యాంగ రూపశిల్పి అని, అణగారిన వర్గాలలో,సాంఘీక, రాజకీయ చైతన్యం తెచ్చిన, నిత్య సమర శీలి అని, భవిష్యత్తు తరాలు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని, అంబేద్కర్ కొందరి వాడు కాదు , అందరివాడని వారు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కమతం కొండయ్య, మాతంగి వీరబాబు, కాంపాటి పరశురాములు, మాతంగి సైదులు, మాతంగి ఉదయ్ కుమార్, కాంపాటి సందీప్, మాతంగి వీరస్వామి, ఎమ్మార్పీఎస్ నాయకులు విద్యార్థులు గ్రామపంచాయతీ కార్యదర్శి పూల శ్రీనివాసరావు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin