సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : దళిత న్యాయవాద దంపతులపై దాడిని నిరసిస్తూ వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ డాక్టర్ కేవీ కృష్ణారావు మాట్లాడుతూ. న్యాయవాద దంపతులపై దాడిచేయడం హేయమైనచర్య అన్నారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయకుంటే బహుజన జేఏసీ కులాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు దాసరిశ్రీనివాస్, పెరుగు వెంకటరమణ, భద్రునాయక్, సం జీవరావు, రెహమాన్, రవి, ప్రసాద్, రమ్య, సరోజిని, ఉపేంద్రనాయక్, నజీమా, మస్తాన్, వీరబాబు, సంపత్కుమార్, సంతోస్, వెంక టనారాయణ, సలీం, శ్రీనివాసరెడ్డి, నారుమళ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin