సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక ఏ ఎం సీ కాలనీ నందు పుట్టి రవి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అల్లాడు పౌల్ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు డబ్బులు ఇస్తానని బి ఆర్ ఎస్ పార్టీ చెబుతా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వటం లేదని, గిరిజనులకే డబల్ బెడ్ రూమ్ ఇండ్లని కేటాయించడం జరుగుతుందని అధికారులు వంత పలుకుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి పెరిగిన దళితులను, గిరిజనేతర్లను పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, దళితులను ఇతర పథకాలకు అనర్హులుగా చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఒక సామాజిక వర్గానికి ఇలా ఇండ్లను కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని, దళితుల ఓట్లతోనే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి దళితులకు మొండి చూపడం సరైనది కాదని ఆయన అన్నారు. దళితులకు కూడా డబల్ బెడ్ రూములు ఇండ్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, లేకపోతే దళితులు ఇతర వర్గాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అల్లాడి జయరాజ్, కనకరాజు, డేగలరాజు, రామకృష్ణ, శ్రీను సామేలు, చిట్టిబాబు, బల్లెం ఉదయ కాంత్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin