సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఆదివారం నాడు విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో పాలకవీడు మండలం బొత్తలపాలేం గ్రామానికి చెందిన పిన్నెల్లి సాయి మహిత ఓబీసీ విభాగంలో 2250 ర్యాంక్, సాధించి సత్తా చాటింది. పిన్నెల్లి సాయి మహిత, తల్లిదండ్రులు పిన్నెల్లి గోపయ్య భాగ్యలక్ష్మి లు వృత్తిరీత్యా హైదరాబాదులో నివాసం ఉంటున్నారు.సాయి మహిత ఉన్నత విద్య ఎల్బి నగర్ నారాయణ హై స్కూల్ లో చదివి పదవ తరగతి లో 10/10,ఇంటర్మీడియేట్ కుంట్లూర్ నారాయణ కాలేజ్ లో చదివి 986 మార్క్స్ సాధించడంతోపాటు ఎంసెట్ లో 1200 ర్యాంక్,జేఈఈ మెయిన్స్ లో1342 ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు,గ్రామస్తులు సాయి మహితను అభినందించారు.మున్ముందు ఉన్నత స్థానాన్ని దక్కించుకొని గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.
-----------------------
Admin