సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలు ఉద్దేశించి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు,పెన్నులు,జామెంట్రీ బాక్స్ లు అందజేసి మరోసారి మానవత్వం చాటుకున్న బూర్గంపహాడ్ ASI సత్యనారాయన.విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు అడగకుండానే విద్యార్థులకు సహకారం అందిన ASI సత్యనారాయనకు విద్యార్థులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మరియు వారి సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.గతంలో పలు సేవా కార్యక్రమాలకు ASI సత్యనారాయణ చేసిన సహాయ సహకారాలు తెలిసినవే,విద్యార్థులకు హల్ టికెట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏ.ఎస్.ఐ సత్యనారాయన విద్యార్థులకు హల్ టికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏ.ఎస్.ఐ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు పదవ తరగతి మొదటి మెట్టు అని,విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు,పాఠశాలకు,గ్రామానికి,జిల్లాకి,రాష్ట్రానికి వన్నేతెచ్చిపెట్టాలని విద్యార్థులను కోరారు.ఈ పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని పాఠశాల మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి మొదటి బహుమతి క్రింద విద్యార్థిని ఆకట్టుకునే విధమైన విద్యార్థికి ఉపయోగ పడే విధమైన బహుమతి ఇస్తానని విద్యార్థులను ప్రోత్సహిస్తూ హామీ ఇచ్చారు,విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు,ముందు గురువుకి మర్యాద ఇస్తే క్రమ శిక్షణ దాని అంతట అదే వస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాన్సన్ మరియు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు....
-----------------------
Admin