సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండల కేంద్రంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రెమిడాల రాజు,ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదలైన వ్యవసాయ కార్మికులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తగిన స్థానం కల్పించకుండా కార్పొరేట్ వ్యవసాయాలకు మద్దతు పలుకుతుందని చిన్న సన్నకారు రైతులు కేంద్రంపై పోరాటలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతు పండించిన పంటకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించక పోవడంతో పాటు పండిన పంటను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని,ముఖ్యంగా జిల్లా వ్యాపితంగా ఉన్న పోడు భూముల రైతులకు భూమి హక్కు పత్రాలు ఇప్పించడం లో తాత్సారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని అభివృద్ధి పేరుతో ప్రతి ఏటా నిధులు కోత విధించడం విచారకరమని వ్యవసాయం యాంత్రికరణ అవుతున్నందున చేతినిండా పని లేక వ్యవసాయకార్మికులు వలసలు పోయే దుస్థితి దాపురించిందని ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులను నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాల పై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచన చేస్తుందని తక్షణమే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీల జీవన విధానం పై సమగ్ర సర్వే నిర్వహించి వారిజీవిత భద్రత కొరకు,తగు చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక కుటుంబాల వారికి ఉచిత విద్య ఉచిత వైద్యం అందించాలని వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జడ వెంకన్న,కందుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin