సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దుమ్ముగూడెం మండలంలో ముగ్గురు మావోయిస్టు సభ్యుల అరెస్టు, నిషేధిత సిపిఐ మావోయిస్టు పా ర్టీకి చెందిన ఇద్దరు పామేడు దళం సభ్యులను, ఒక సానుభూతిపరుడుని అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తెలంగాణ చత్తీస్ ఘఢ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన పైడిగూడెం గ్రామ సరిహద్దు అటవీ ప్రాంతంలో దుమ్ముగూడెం పోలీసులు సీఆర్పీఎఫ్ 212, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ పోలీసులు కలసి సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు పామేడు దళ సభ్యులను ఒక మావోయిస్టు సానుభూతిపరుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్ట్ కాబడిన వారు సోడి కామే కొమరారం గ్రామం, సోడి బండు కొమరారం గ్రామం, చత్తీస్ ఘఢ్ రాష్ట్రం, సోడి చంటి ఫలచలమా గ్రామం కిష్టారం, (మావోయిస్టు సానుభూతిపరుడు)వీరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు కాబడిన సోడి కామే, సోడి బందు గత ఐదేళ్లుగా మావోయిస్టు పార్టీ కామేడు దళంలో దళ సభ్యులుగా పనిచేస్తూ తెలంగాణ-చత్తీస్ ఘఢ్ రాష్ట్ర మావోయిస్టు పార్టీ సభ్యులతో కలిసి అనేక సంఘటనలో పాల్గొన్నట్టు ఎస్పీ తెలిపారు. వీరిపై దుమ్ముగూడెం, చర్ల, చత్తీస్ ఘఢ్ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదు అయ్యాయని ఎస్పీ వినీత్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు....
-----------------------
Admin