సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : సమాజంలో మానవత్వం, సామరస్యం, సహకారం చాలా గొప్పవని వీటితోనే దేశంలో గణనీయమైన అభివృద్ధిని సాధించవచ్చని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంతో పాటు పలు చోట్ల జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం వీరులు చేసిన త్యాగాన్ని ఎన్నటికీ మరువలేమని అందుకే ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవాలు నాడు వారి త్యాగాలను స్మరించుకుంటున్నామని అన్నారు. సమాజంలో కులాలకు మతాలకు అతీతంగా కలిసివచ్చి సామరస్యంగా ప్రజలందరూ మెలిగిన నాడే సంపూర్ణమైన అభివృద్ధి సహకారం అవుతుందని అన్నారు. ప్రతి మనిషిలో కష్టపడే తత్వం నిజాయితీ, త్యాగ గుణం ఉండాలని ఆకాంక్షించారు. వీటితోనే కుటుంబం గ్రామం రాష్ట్రం తద్వారా దేశం బాగుపడుతుందని అన్నారు. మానవసేవే మాధవ సేవ అన్న నానుడి పాటించి అందరిని సేవతో మెప్పించాలని అన్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన స్వతంత్ర వేడుకల్లో ప్రజలకు పిలుపునిచ్చారు. అదే విధంగా అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్గా ఉందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంపదను పెంచి పేదలకు పంచుతున్నారని చెప్పారు. మహాత్మా గాంధీ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఇద్రీస్, జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ నటరాజ్ ఎస్సై ప్రతాప్ లింగం ఆర్డిఓ మాధవ రమణ, తాసిల్దార్ పార్థసారథి, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
-----------------------
Admin