సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం లో ఆస్తులు కోల్పోయిన వాసి కి పునరావాసం కింద ఇచ్చిన భూమిని అక్రమంగా పట్టా పొందిన కందుల సైదిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని బాధితులు కలిమెల వెంకటయ్య ఆరోపించారు. బాధితుడు కలిమెల వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణదశలో ముంపుకు గురైన చిన్నమ్మ గూడెం తాలుకు దేవరకొండ వాసి కలిమెల చిన్న వెంకయ్య పేరున నాటి ప్రభుత్వం పునరావాసం చట్టం కింద దామరచర్ల మండలం రాజుగట్టు గ్రామ శివారు సర్వేనెంబర్ 826 /33/1 న పునరావసం చట్టం కింద 4 ఎకరాలు 4 గుంటలు ఇంటి స్థలం ఇవ్వడం జరిగిందన్నారు. తాను జీవనోపాధి కోసం రాజు గట్టు గ్రామం విడిచి తన కుటుంబంతో ములకల కాలువ వలస వెళ్లి జీవిస్తున్నానని అన్నారు. ఇట్టి భూమిపై కన్ను వేసిన దామరచర్ల కేంద్రానికి చెందిన కందుల సైదిరెడ్డి రాజాగట్టు గ్రామంలోని అదే పేరుతో ఉన్న వ్యక్తిని నమ్మించి అతని వద్ద నాలుగు ఎకరాలు భూమిని కొనుగోలు చేసినట్టు పత్రాలను సృష్టించి తాసిల్దార్ కార్యాలయం అధికారులను నమ్మించి పట్టా సృష్టించినట్లు ఆరోపించారు.ఇంతలోనే అసలు వ్యక్తి అయినా కరిమెల వెంకటయ్యకు విషయం తెలియడంతో రాజగట్టు గ్రామంలోని తన భూమి వద్దకు వెళ్లి గమనించగా నాలుగు ఎకరాల భూమిని సైదిరెడ్డి స్వాదినపరుచుకున్నట్లు పేర్కొన్నారు.తాను గాని తన తండ్రి కానీ నాడు ప్రభుత్వం పునరావసం కింద ఇచ్చిన భూమిని నాటినుండి నేడు వరకు మేము ఎవరికీ అమ్మకం జరపలేదని కందుల సైదిరెడ్డి కావాలని తన భూమిని అక్రమంగా పట్టా చేయించుకుని చీటింగ్ చేశారని ఆగ్రహించారు. తనకు తెలియకుండానే తన భూమిలో బత్తాయి తోట వేశారని ఆరోపించారు. ఇంతటి అక్రమాలకు పాల్పడిన పాల్పడిన కందుల సైదిరెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తన తండ్రి కలిమెల చిన్న వెంకయ్య పేరున రికార్డు కలిగి ఉన్న భూమిని తనకు ఇప్పించి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆవేదనతో సబ్ కలెక్టర్ ను కోరారు...
-----------------------
Admin