సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : *దశాబ్ద కాలంగా నిరీక్షించిన నెరవేరని కల..నేడు ప్రజాపాలనలో ఇందిరమ్మ ప్రభుత్వంలో నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తున్న తరుణం* *ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి* *నర్సంపేట* నల్లబెల్లి మండలం రామతీర్థం గ్రామంలో సట్ల ఐలమ్మ అనే లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేయగా,నల్లబెల్లి మండల కేంద్రంలో మొట్టమొదటి ఇల్లు గృహప్రవేశానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి,లబ్దిదారుని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు...లబ్ధిదారులు మాట్లాడుతూ అడగకముందే మాకు గూడు అందించినందుకు సంతోషంగా ఎమ్మెల్యే గారికి మీరు మా పేద ప్రజలకు మీరు దొరకడం మా అదృష్టం అని ఆనందాన్ని వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లతో పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. నియోజకవర్గంలో 3750 ఇండ్లు మంజూరు అయ్యాయని వివిధ దశలలో ఉన్నాయని అన్నారు... ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Reporter