సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ లోని సవితమ్మ కార్యాలయంలో మాట్లాడుతూ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పుకుంటున్న ప్రభుత్వం 12వ తేదీ వరకూ జీతాలు చెల్లించలేని స్థితిలో ఉందా..? తెలుగుదేశం ప్రభుత్వంలో నెలలో మొదటి తారీఖున ఉద్యోగుల ఖాతాలలో ఖచ్చితంగా జీతాలు పడేవి. ఈ అసమర్థ ప్రభుత్వం వచ్చాక ఢిల్లీలో అప్పు దొరికితేనే ఏపీలో జీతాలు. ఏపీలో ఆర్థిక శాఖా మంత్రి అనే పదవి లేదు ఇప్పుడున్నది కేవలం అప్పుల శాఖా మంత్రి మాత్రమే. 12 వ తేదీ వస్తున్నా ఇంకా ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు. గత ప్రభుత్వంలో అభివృద్ది కోసం కొద్దిగా అప్పు చేస్తే నానా యాగీ చేసిన ఇదే ఆర్థిక మంత్రి ఇప్పుడు నిస్సిగ్గుగా జగన్ చేయిస్తున్న లక్షల కోట్ల అప్పులను సమర్థిస్తున్నాడు. ఒక వైపు బదిలీల GO లు ఇస్తావు. మరోవైపు సర్దుబాటు ఉత్తర్వులు ఇస్తావు ఏది జరుగుతుంది అన్న అయోమయం లో పెట్టి జీతాలు అడగ కుండా డైవరషన్ రాజకీయాలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో ఉద్యోగస్తుల బుద్ధి చెబుతారని వైసీపీ ప్రభుత్వం పై మండిపడిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ అడదాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రసాద్, త్రివేంద్ర నాయుడు, కౌన్సిలర్ గీతా హనుమంతు,కొనపురం కేసవయ్య,బాలు, నాగార్జున మరియు ఇతరులు.....
-----------------------
Admin