Sunday, 26 July 2026 11:54:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పాల్వంచలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి...

Date : 07 September 2023 09:18 AM Views : 146

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ రూరల్ : ప్రజలను కేవలం ఓట్లు వేసే మర యంత్రాలుగా చూడడం ఎంతవరకు న్యాయమని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రశ్నించారు.మంగళవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పాల్వంచ మండలం మొండికట్ట గ్రామంలో పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ పాల్వంచ పట్టణం,మండలంలో ప్రజలకు కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనేక తండాలలో తాను పర్యటించినప్పుడు వీధిదీపాల సంగతి పక్కన పెడితే ఇళ్లల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.వర్షాకాలంలో ప్రజలు అనారోగ్యాల బారినపడి ఆసుపత్రులకు వెళ్లాలంటే కనీసం ఆంబులెన్స్ సౌకర్యం కూడా లేదని అన్నారు.కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ పాల్వంచ ఆసుపత్రికి వచ్చే రోగులను డయాలసిస్ కోసం మణుగూరు,భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడం విడ్డూరంగా ఉందన్నారు.ఇప్పటికైనా పాలకులు,వైద్యాధికారులు పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అంబులెన్స్ సౌకర్యం గురించి గతంలో ఆందోళనలు నిర్వహించామని,అధికారుల దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు.తక్షణమే అధికారులు స్పందించి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో పాల్వంచ మండల పరిధిలోని కుగ్రామాలలో నివసించే ప్రజలను మమేకం చేసి బీఎస్పి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,సాయి,కేతిని కుమారి,యెర్రంశెట్టి రాజేశ్వరి,మంజుల తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :