సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కొత్తగూడెం : యుద్ధాలు వద్దురా కొడకా మనది గీత వృత్తి, అది చేసే బ్రతకాలి అని సర్వాయి పాపన్న తల్లి అన్నప్పుడు తాటి చెట్టు ఎక్కితే ఎమోస్తదమ్మా...ముంత కల్లు తప్ప, కొడితే గోల్కొండ కోటను కొట్టాలి,రాజై పాలించాలని రాజ్యాన్ని ఏలిన, వెన్నుచూపని బహుజన పోరాట యోధుడు సర్వాయి పాపన్న అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.శుక్రవారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 మంది స్నేహితులతో పాపన్న మొదలు పెట్టిన గెరిల్లా సైన్యం అటు స్థానిక దొరల,జమిందార్ల,ఇటు మొఘల్ సైనికులపై దాడులు చేసి గడీల దొరల గుండెల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తించి గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగురవేసి,బహుజన రాజ్యం స్థాపించిన యోధుడని,ఏ నేపధ్యం లేని పాపన్న, నాడు బరిసెలు,పిరంగులు...నేడు పోలింగ్ బూతులు,బ్యాలెట్స్..సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తితో తెలంగాణను విముక్తి చేసి,ప్రజాస్వామిక తెలంగాణను స్థాపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,బీఎస్పీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులుసాయి,కవిత,నీల,శారద,హారిక,సునీత తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin