సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి చేతుల మీదుగా గాంధీజీ విగ్రహాల ప్రదర్శన గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ యొక్క ఆశయాల మార్గంలో నేటి తరం అవలంబించే విధంగా ముందుకు సాగాలని 100 సంవత్సరాలకు పూర్వమే గ్రామ స్వరాజ్యంపై మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై గాంధీజీ కలలుగన్నారని అన్నారు. అనంతరం గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన కార్యక్రమానికి నాంది పలికిన- గాంధీ జ్ఞానం ప్రతిష్టం,గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో ఈరోజు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి కి మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ పులి అనిల్ కుమార్ రాజేందర్ రెడ్డి ఫౌండేషన్ కమిటీ సభ్యులు, మునిసిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ పాల్గొన్నారు.
-----------------------
Admin