సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో వరి నారుమడులను పరిశీలించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు 1.} సాయంత్రం వేళలో నారుమడిలో నీరు తీసివేసి పగటిపూట వెచ్చటి నీరు పెడుతూ ఉండాలి 2.} రోజు సాయంత్రం ఒక అడుగు ఎత్తులో వెదురు బద్దలు అమర్చి దానిమీద సన్నటి ప్లాస్టిక్ షీట్ లేదా కల్లాల పట్టాలు తో నారుమడి మీద కప్పి మరుసటి రోజు ఉదయం తీసివేయాలి 3} .జింకు లోపం వలన ఆకులపై తుప్పుమచ్చలు ఏర్పడతాయి కావున జింక్ సల్ఫేట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి 4} .నారు ఆరోగ్యంగా పెరగడానికి మరియు వేస్తున్నప్పుడు ఒక కిలో యూరియా కి రెండు గ్రాముల కార్బన్డిజం+ మాంకోజెబ్ మిశ్రమం మందును కలిపి పిచికారి చేయాలి 5} .కాండం తొలుచు పురుగు నుండి కాపాడుకోవడానికి కార్బో ఫ్యూరాన్ 3జి గుళికలు ఎకరాకు సరిపడే నారుమడికి ఒక కిలో చొప్పున చల్లాలి 6.} చలి తీవ్రత ఎక్కువ ఉండి మంచుతో కూడిన వాతావరణం ఉన్నచో అగ్గి తెగులు ఆశించకుండా ముందు జాగ్రత్తగా ట్రైక్లోజల్ 0.6గ్రాములు లీటర్ నీటికి చొప్పున పిచికారి చేయాలి. ఈ కార్యక్రమంలోనాయకులు నాగభూషణం, రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్ రాజలింగం, ఉప సర్పంచ్ శ్రీనివాస్,వార్డ్ సభ్యులు శరత్ , రైతులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin