సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : లక్ష్మీదేవిపల్లి: కొత్తగూడెం నియోజకవర్గంలోని అనేక మారుమూల గ్రామాల్లో ప్రజలు కనీస సౌకర్యాలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆవేదన వ్యక్తం చేశారు.లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామంలోని హరియాతండాలో ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన గ్రామంలో పర్యటించారు.ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరియాతండాలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అన్నారు.గ్రామాలలో విద్యుత్ వెలుగులను అందించాల్సిన వీధిదీపాలు సైతం లేవని,వాటిని ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.పల్లెలు ప్రగతి పథంలో నడిచినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి జరిగినట్లని అన్నారు.జిల్లాలో 30 వేల మంది పై చిలుకు మంది దారిద్రరేఖకు దిగువన ఉన్నవారు తెల్లరేషన్ కార్డుల కోసం అదేవిధంగా రేషన్ కార్డుల్లో పొరపాటున పేరు తొలగించిన వారు,కొత్తగా పేరు నమోదు కోసం దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు.దరఖాస్తులు చేసుకొని మూడు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు దానికి అతీగతి లేదని ఆరోపించారు.నిజమైన పేదలను గుర్తించి వారికి తెల్లరేషన్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ధరావత్ లక్ష్మణ్,ధరావత్ తులసి,వెంకన్న,రాంసింగ్,నిర్మల,భూక్య కమలి తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin