Monday, 27 July 2026 10:50:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మారుమూల గ్రామాల్లో సమస్యలు కోకొల్లలు... -బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్

Date : 07 July 2023 04:06 AM Views : 337

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : లక్ష్మీదేవిపల్లి: కొత్తగూడెం నియోజకవర్గంలోని అనేక మారుమూల గ్రామాల్లో ప్రజలు కనీస సౌకర్యాలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆవేదన వ్యక్తం చేశారు.లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామంలోని హరియాతండాలో ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన గ్రామంలో పర్యటించారు.ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరియాతండాలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అన్నారు.గ్రామాలలో విద్యుత్ వెలుగులను అందించాల్సిన వీధిదీపాలు సైతం లేవని,వాటిని ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.పల్లెలు ప్రగతి పథంలో నడిచినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి జరిగినట్లని అన్నారు.జిల్లాలో 30 వేల మంది పై చిలుకు మంది దారిద్రరేఖకు దిగువన ఉన్నవారు తెల్లరేషన్ కార్డుల కోసం అదేవిధంగా రేషన్ కార్డుల్లో పొరపాటున పేరు తొలగించిన వారు,కొత్తగా పేరు నమోదు కోసం దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు.దరఖాస్తులు చేసుకొని మూడు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు దానికి అతీగతి లేదని ఆరోపించారు.నిజమైన పేదలను గుర్తించి వారికి తెల్లరేషన్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ధరావత్ లక్ష్మణ్,ధరావత్ తులసి,వెంకన్న,రాంసింగ్,నిర్మల,భూక్య కమలి తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :