సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రాజీవ్ గృహకల్ప పేద పిల్లలు చదువుకు దూరం కావద్దని, ఆరు సంవత్సరాల క్రితం తన సొంత నిధులతో సుమారుగా 50 లక్షల రూపాయలతో సురభికాలనీలో ప్రభుత్వ ప్రాధమిక ఆంగ్ల మధ్యమ పాఠశాలలోనిర్మించారు, కార్పొరేటర్ విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్స్ ను అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అధ్యాపకులు బోదిస్తున్న విద్యను చక్కగా అర్ధం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సమాజంలో ఆదర్శవంతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల చదువు కొరకు తన వంతు కృషి ఎల్లపుడు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటి చైర్మన్ బస్వరాజ్ లింగయ్యత్, ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు దేవదాసు, అధ్యాపకులు ఆశ్రఫ్, గోపాల్ యాదవ్, పాఠశాల సిబ్బంది, మిడ్ డే మీల్స్ సిబ్బంది, విద్యార్థుల తల్లి తండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin