సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజైనా గురువారం షాద్ నగర్ పట్టణంలోని బొబ్బిలి చెరువు కట్టపై నిర్వహించిన ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పథకం ద్వారా ప్రతి చెరువులో పూడికతీత పనులు చేపట్టి జలకళ తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. రైతులతో పాటు మత్స్యకారుల సంక్షేమం కోసం చెరువులలో చేపలు పెంచేందుకు ఉచితంగా చేప పిల్లల్ని పంపిణీ చేసి వారి ఆర్థిక అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. రాష్ట్రంలో నిర్దేశించిన లక్ష్యానికి మించి వ్యవసాయ ఉత్పత్తులు పండుతున్నాయని తెలిపారు. ప్రతి రైతు గర్వంగా తలెత్తుకొని జీవించే పరిస్థితులు ఏర్పరిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin