సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల కేంద్రానికి సమీపంలో ఎం. కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయం ఆవరణలో బ్రహ్మో ఉత్సవ రధం సంరక్షణ రేకుల షెడ్డు ఏర్పాటు పనుల కోసం ఆదివారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారని ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు. వడ్డివారిపల్లి గ్రామానికి చెందిన దాత ఉత్తమరెడ్డి రధం సంరక్షణ కోసం దాదాపు 30 వేలు విలువ చేసే రేకులు,ఇనుప సామాగ్రి అందచేశారన్నారు. ముందుగా మఘుమాసం పౌర్ణమి సందర్బంగా వినాయకస్వామి, సుబ్రహ్మణ్యంస్వామి, అయ్యప్పస్వామి వారికి పసుపు, కుంకుమ, కాయకర్పూరం సమర్పించి అనంతరం భూమిపూజ నిర్వహించి రేకుల షెడ్డు పనులు చేపట్టారని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎం.కొత్తపల్లి గిరి, హనుమంతరెడ్డి,సుధాకర్ స్వామి,టైలర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin